త్వరలో హైదరాబాద్లో నిర్మించబోయే 'ఇమేజ్' టవర్ల ఫస్ట్ లుక్ను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు విడుదల చేశారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న నాస్కామ్ గేమ్ డెవలపర్ల సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ఈ నమూనాను ఆవిష్కరించారు. సరికొత్త, అత్యాధునిక డిజైన్లో ఈ టవర్లను నిర్మించడానికి తలపెట్టినట్లు తెలుస్తోంది.
ఇందులో ఇమేజ్ అంటే.. ఇన్నోవేషన్ ఇన్న మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని కేటీఆర్ ఒక ట్వీట్లో వివరించారు. నాలుగు వైపులా నాలుగు టవర్లతో పాటు.. పై భాగంలో వాటన్నింటినీ కలుపుతూ ఈ నిర్మాణం కనిపిస్తోంది. టవర్ల మధ్యభాగంలో కూడా పెద్ద పరిమాణంలో ఉండే టీవీ స్క్రీన్లు సైతం మోడల్లో కనిపిస్తున్నాయి. కింది భాగంలో రెండు స్విమ్మింగ్ పూల్స్ కూడా డిజైన్లో భాగంగా ఉన్నాయి. ప్రధానంగా మల్టీమీడియా, గేమింగ్ పరిశ్రమను దృష్టిలో పెట్టకుని ఈ టవర్స్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.
Unveiled first look of IMAGE tower (Innovation in Multimedia, Animation, Gaming & Entertainment) at the NASSCOM Game developers conference pic.twitter.com/yKBjsYgFjV