లీజుకు ఆర్టీసీ స్థలాలు

17 Mar, 2017 12:46 IST|Sakshi
హైదరాబాద్‌: ఆర్టీసీ సంస్థకు చెందిన ఖాళీగా ఉన్న 69 స్థలాలను ఆయిల్ కంపెనీలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. 357 బస్ స్టేషన్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఆర్టీసీకి చెందిన మరో 150 స్థలాలను గుర్తించి అదనపు ఆదాయం కోసం కృషి చేస్తున్నామన్నారు.
మరిన్ని వార్తలు