కేసీఆర్ వ్యాఖ్యలపై మండిప‌డ్డ మంత్రి శైలజానాథ్‌

3 Aug, 2013 17:37 IST|Sakshi
కేసీఆర్ వ్యాఖ్యలపై మండిప‌డ్డ మంత్రి శైలజానాథ్‌

 సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ విడిచి వెళ్లాలంటూ తెలంగాణ రాష్ట్ర స‌మితి అధ్యక్షుడు కేసీఆర్ చేసిన వివాద‌స్పద వాఖ్యల‌పై ప్రాథ‌మిక విద్యాశాఖ మంత్రి శైల‌జానాథ్ మండిప‌డ్డారు. ఆయ‌న మాట్లాడుతూ..  కేసీఆర్ బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నారని చెప్పారు. ఎవరి దయాదాక్షన్యాలతోనో త‌మ‌ ఉద్యోగులు ఇక్కడ బతకాల్సిన పని లేదని అన్నారు. హైద‌రాబాద్ కేసీఆర్ జాగీరేమీ కాదని చెప్పారు. రాజ్యంగం ప్రకారం ఎక్కడైనా ఉండే హక్కు త‌మ‌కుంద‌ని శైల‌జానాథ్ తెలిపారు.

కేసీఆర్ విజయనగర్ నుంచి వలసొచ్చిన సంగతి మర్చిపోకు అంటూ గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటున్నారు. మ‌రోవైపు సీమాంధ్ర టీడీపీ నేత‌లు మాత్రం స‌మైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నారు. ఈ వ్యవ‌హారంలో టీడీపీ నేత‌లు స్పష్టమైన వైఖ‌రి చెప్పాల‌ని మంత్రి శైల‌జానాథ్ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు