'స్నేహితుల వేధింపులకు పారిపోయా'

7 Mar, 2017 12:15 IST|Sakshi
హైదరాబాద్: హైదరాబాద్‌లో సోమవారం అదృశ‍్యమైన హాస‍్టల్‌విద్యార్థి మంగళవారం ఉదయం నల‍్లగొండలో ప్రత‍్యక్షమయ్యాడు. హయత్‌నగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల హాస‍్టల్‌లో ఉంటున‍్న 9వ తరగతి విద్యార్థి అజయ్‌ సోమవారం ఉదయం హాస‍్టల్‌ నుంచి అదృశ‍్యమయ్యాడు. హాస‍్టల్‌ వార‍్డెన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ​ప్రారంభించారు. అజయ్‌ నల‍్లగొండలో ఉన్నాడన‍్న సమాచారంతో అక‍్కడికి వెళ్ళిన పోలీసులు విద్యార్థిని తీసుకుని వచ్చారు. తోటి విద్యార్థుల వేధింపులకు తాళలేకే తాను హాస‍్టల్‌ నుంచి పారిపోయినట్టు అజయ్ చెప్పాడు.
 
మరిన్ని వార్తలు