-

ఓటుకు కోట్లు కేసులో కోర్టుకు సండ్ర

1 Apr, 2017 00:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో నిందితునిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. వీరయ్య హాజరును నమోదు చేసుకున్న కోర్టు తదుపరి విచారణను మే 9కి వాయిదా వేసింది.

మరోవైపు పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్‌రావు దాఖలు చేసిన పరువునష్టం కేసులో నాంపల్లి కోర్టుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హాజరు కావాల్సి ఉంది. అయితే న్యాయవాదులు విధులు బహిష్కరించిన నేపథ్యంలో హాజరుకాలేకపోతున్నట్లు రేవంత్‌ తరఫు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి కోర్టు అనుమతించింది.

మరిన్ని వార్తలు