'కుట్రపూరితంగానే సెక్షన్-8 ప్రస్తావన'

4 Feb, 2016 15:05 IST|Sakshi

హైదరాబాద్: తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కుట్రపూరితంగానే సెక్షన్-8 అంశాన్ని ప్రస్తావిస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సి కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు విషయంలో అప్పుడు చంద్రబాబు సెక్షన్-8 అంశాన్ని ప్రస్తావించగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తుతోందని ఆయన తెలిపారు. దొంగలు దొంగలు ఒకటైనట్టుగా కాంగ్రెస్, టీడీపీలు కలిశాయని ఆయన విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు.
 

మరిన్ని వార్తలు