తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం

29 Mar, 2016 20:06 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం లభించింది. మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. విపక్షాల సూచనలను పాటిస్తున్నామని, కీలక అంశాలపై అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని అన్నారు.

అసెంబ్లీలో విపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ.. ద్రవ్య వినిమయ బిల్లులో ఆర్థిక అంశాలపై స్పష్టత లేదని విమర్శించారు. కేటాయింపులు చేసిన విధంగా నిధుల వ్యయం లేదంటూ సభలో నిరసన తెలిపారు.

మరిన్ని వార్తలు