ముగ్గురు పిల్లలతో సహా సాగర్ లో దూకిన మహిళ

29 May, 2016 16:33 IST|Sakshi

హైదరాబాద్: తన ముగ్గురు పిల్లలు సహా ఓ తల్లి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజ్గిరికి చెందిన అవినాష్, జసంత ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరికి సంతానం ముగ్గురు కాగా, అందరూ ఆడపిల్లలే పుట్టారన్న సాకుతో భర్త ఆమెను వదిలేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోలేదని ముగ్గురు పిల్లలతో సహా జసంత సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా, లేక్ పోలీసులు వారిని కాపాడారు. ఇదే విషయంపై ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు