కిలిమంజారోను అధిరోహించిన బాలికకు ప్రోత్సాహం

10 Jun, 2017 08:43 IST|Sakshi
కిలిమంజారోను అధిరోహించిన బాలికకు ప్రోత్సాహం

హైదరాబాద్‌: ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతం కిలిమంజారోను అధిరోహించిన నగర బాలికకు నలందా గ్రూప్‌ నజరానా ప్రకటించింది. ఇక నుంచి ఆ బాలిక విద్యకు సంబంధించిన వ్యయాన్ని తాము చూసుకుంటామని ప్రకటించింది.

తొమ్మిదేళ్ల వినీలా మండేలా ఈ ఏడాది జనవరి 12న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఆసియా నుంచి ఈ పర్వతాన్ని అధిరోహించిన చిన్నవయస్కురాలు వినీలానే కావడం విశేషం. వినీలా సాధించిన ఘనతను గుర్తించిన నలందా గ్రూప్‌ శుక్రవారం బాలికను అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా కిలిమంజారో పర్వతారోహణకు సంబంధించిన అనుభవాలను వినీలా పంచుకుంది. సోదరుడు వినీల్‌ శిక్షణలో ఈ ఫీట్‌ను సాధించినట్లు వెల్లడించింది.

మరిన్ని వార్తలు