విజయ సాయిరెడ్డికి తప్పిన ప్రమాదం

10 May, 2016 08:43 IST|Sakshi
విజయ సాయిరెడ్డికి తప్పిన ప్రమాదం

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డికి మంగళవారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది.  శంషాబాద్ విమానాశ్రయానికి వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విజయ సాయిరెడ్డి సహా పార్టీ నేతలు దుర్గా ప్రసాదరాజు, దశరథ్ రెడ్డి, డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వీరంతా ప్రత్యేక హోదాపై ఏలూరు ధర్నాలో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 


 

మరిన్ని వార్తలు