నయీం కేసులో మరో ట్విస్టు

14 Aug, 2016 19:36 IST|Sakshi
నయీం కేసులో మరో ట్విస్టు

అనంతపురం: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొస్తున్నాయి. వార్తా కథనాల్లో వచ్చినట్లు పలువురు ఉన్నతస్థాయి అధికారుల, పదవీ విరమణ పొందిన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే ఘడియలు మొదలయ్యాయి. ఈ కేసుకు విచారణకు సంబంధించి నయీం కేసులో విజయవాడకు చెందిన రిటైర్డ్ పోలీసు అధికారిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నయీంకు గతంలో కొన్ని కేసుల్లో సదరు అధికారి సహకరించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.

నయీం డైరీలో నుంచి సేకరించిన సమాచారంతో ఆ రిటైర్డ్ అయిన అధికారిని సిట్ బృందం విచారిస్తోంది. మరోపక్క, నయీం డ్రైవర్ శామ్యూల్స్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా చర్ల నుంచి అతడు చత్తీస్గఢ్ వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. శామ్యూల్ నుంచి 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ఇక నయీంకు సంబంధించి మరో ఆస్తి బయటపడింది. పుప్పాలగూడలో నయీంకు సంబంధించిన మరో ఇల్లును పోలీసులు ఆదివారం గుర్తించారు.

అలకాపూర్ ఇంటికి కిలోమీటర్ దూరంలో నాలుగు అంతస్తుల్లో ఈ ఇల్లు నిర్మించి ఉంది. విలాసవంతమైన ఈ ఇంట్లో పోలీసుల సోదాలు నిర్వహించారు. భారీగా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే,.. నయీం నేరాలు ఆంధ్రప్రదేశ్లో లేవని డీజీపీ సాంబశివరావు అన్నారు. ఏపీలో నయీం కేసు విషయం సిట్ అవసరం లేదని, తెలంగాణ దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. కృష్ణా పుష్కరాలు రద్దీకి ఆంక్షలు సడలిస్తామని చెప్పారు. అనంతపురంలో రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.

మరిన్ని వార్తలు