దత్తాత్రేయతో ఎంపీ కవిత భేటీ

3 Apr, 2016 16:38 IST|Sakshi
దత్తాత్రేయతో ఎంపీ కవిత భేటీ

హైదరాబాద్ : కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో నిజామాబాద్ ఎంపీ కవిత ఆదివారం భేటీయ్యారు. దిల్కుష్ గెస్ట్ హౌస్లో కేంద్రమంత్రిని కలసి బీడీ కట్టలపై పుర్రె గుర్తు సైజు తగ్గించే విషయంపై చర్చించారు. బీడీ కట్టలపై 85 శాతం పుర్రె గుర్తు ముద్రించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉప సంహరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కనీసం 50 శాతానికి తగ్గించే విధంగా కేంద్రంతో మాట్లాడాలని కోరారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో పాటు ప్రధాని మోదీతో మాట్లాడి నిబంధనలు సడలించేందుకు ప్రయత్నిస్తానని దత్తాత్రేయ కవితకు తెలిపారు.

మరిన్ని వార్తలు