‘సాక్షి’ ఆపేయాలని మేం చెప్పలేదు: ప్రభుత్వం

21 Jun, 2016 11:42 IST|Sakshi
‘సాక్షి’ ఆపేయాలని మేం చెప్పలేదు: ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ చానల్ ప్రసారాలను నిలిపివేయాలంటూ తాము ఏమీ చెప్పలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టులో తెలిపారు. ఎంఎస్‌వోలకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని వివరించారు.

ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ.. సాక్షి టీవీ ప్రసారాలు ఆపేయాలంటూ ఎలాంటి ఉత్తర్వులు, సూచనలు ఇవ్వలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో తమకు సమర్పించాలని జడ్జి ఆదేశించారు. అందుకోసం గడువు ఇస్తూ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

>
మరిన్ని వార్తలు