'నాన్నకు ప్రేమతో' రక్తదానం చేయండి: హరికృష్ణ

18 Jan, 2016 08:00 IST|Sakshi

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ 20వ వర్థంతి సందర్భంగా సోమవారం ఉదయం ఎన్టీఆర్‌ ఘాట్‌లో హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. నాన్నకు ప్రేమతో రక్తదాన శిబిరాలు విజయవంతం చేయండి' అని అభిమానులకు పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో లెజండరీ బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ అభిమానులందరూ బ్లడ్‌ డొనేషన్‌ చేయాలని ఆయన చెప్పారు. పల్లెలకు రోడ్లు, బస్సులు సౌకర్యాలు కల్పించింది ఎన్టీఆరేనని హరికృష్ణ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు