హైదరాబాద్: నిజాం అంటేనే చాలామంది చిరాకు.. ఇంకొందరికి కోపం.. డిబేట్లకు అవకాశం ఇస్తే మైకులు పగిలిపోయేంత గట్టిగా మాట్లాడతారు. అరాచకాలు, ఆకృత్యాలు, నిరంకుశత్వం అంటూ ఇలా చెప్పుకుంటూ వెళితే చాంతాడంత. ఎంత చెడ్డవారైనా వారు చేసిన కాస్తంత మంచి పనిని గుర్తించి ఆ మంచిని తెలియజేయడమే సరైన చర్య. హైదరాబాద్ చివరి నిజాం, దాదాపు ఆధునిక భాగ్యనగరానికి అంకురార్పణ చేసిన వ్యక్తి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నేడు ఆయన 50 వర్ధంతి.
నిమోనియా కారణంగా కింగ్ కోటి ప్యాలెస్లో 1967, ఫిబ్రవరి 24 అంటే సరిగ్గా ఇదే రోజు చనిపోయాడు. అయితే, నేడు ఆయనను తలుచుకునేవారు లేరు. ఆయన కోసం నిర్మించిన మస్జిద్ ఈ జుడి అనే సమాధి కూడా పట్టించుకోకుండా మిగిలిపోయింది. ఏడో నిజాం మరుగున పడిన రాజే అనే ఇప్పటికే పలు పరిణామాలు చెప్పినా ఒకసారి ఉస్మాన్ చేసిన కొన్ని మంచి పనులు ఆయన వర్ధంతి సందర్భంగా చూస్తే..