బలి తీసుకున్న బర్గర్...

2 Apr, 2014 10:24 IST|Sakshi
బలి తీసుకున్న బర్గర్...

హైదరాబాద్ : బేకరీ పదార్థాల్లో బర్గర్‌ అంటే.. ఇష్టపడనివారుండరు. కమ్మని బర్గర్‌తో ఆకలి తీర్చుకోవాలనుకోగా  అది ఒకరి ఆయువు తీసింది. హైదరాబాద్ పాతబస్తీ హఫీజ్‌ బాబానగర్‌లోని బేక్ వెల్ బేకరీలో ఆహారం కలుషితమైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఎనిమిదిమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం బేకరీ బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు