ఓయూ బీఈడీ పరీక్షల వాయిదా

23 Sep, 2016 19:59 IST|Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో నేడు (24న) జరిగే రెగ్యులర్, దూరవిద్య పరీక్షలను వర్షాల కారణంగా వారుుదా వేసిన్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ అప్పారావు తెలిపారు. నేడు జరిగే బీఈడీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ 5, 6 పేపర్లను ఈ నెల 28కి వారుుదా వేసిన్నట్లు చెప్పారు.

నేడు జరిగే డిస్టెన్స్ మోడ్ 3వ పేపర్‌ను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసిన్నట్లు చెప్పారు. వర్షాల కారణంగా నేడు (24న) కూడా తరగతులను రద్దు చేసిన్నట్లు ఓయూ అధికార వర్గాలు తెలిపారు. అధ్యాపకులు, ఉద్యోగులు మాత్రం విధులకు హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చు.

మరిన్ని వార్తలు