పాపిరెడ్డిని అరెస్ట్‌ చేయాలి: కొనగల

9 May, 2017 02:59 IST|Sakshi
పాపిరెడ్డిని అరెస్ట్‌ చేయాలి: కొనగల

ఈసెట్‌ పరీక్ష ఆలస్యంపై ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: ఈసెట్‌ పరీక్షను ఐదు గంటలు ఆలస్యంగా నిర్వహించడానికి కారుకులైన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డిని అరెస్టు చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగల మహేశ్‌ డిమాండ్‌ చేశారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ శనివారం నిర్వహించిన ఈసెట్‌ పరీక్షపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అనేక అనుమానాలున్నాయని చెప్పారు.

మరిన్ని వార్తలు