తొమ్మిదేళ్ల పాపకు పట్టా..

6 Jun, 2015 01:14 IST|Sakshi
తొమ్మిదేళ్ల పాపకు పట్టా..

మలక్‌పేట: సరూర్‌నగర్ మండల పరిధిలో బైరామల్‌గూడ్ పాత విలేజ్ సర్వేనంబర్ 11లో 90 గజాల ప్రభుత్వం స్థలంలో ( ఇంటినెంబర్ 7-2-74) పెర్రోజు కుమారస్వామి, భార్య లలిత, కుమార్తె నాగేశ్వరీదేవి(9) తో కలిసి  నివాసం ఉంటున్నారు. 58 జీవో కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోగా  అధికారులు కుమారస్వామి కుమార్తె  నాగేశ్వరిదేవి పేరున పట్టా జారీ చేశారు . ఈ విషయంపై  తహశీల్ధార్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా..

ప్రభుత్వ నిబంధనల మేరకు పట్టా గృహిణి పేరుమీదనే జారీ చేస్తున్నాం. అయితే ఆ కుటుంబానికి చెందిన మహిళ లేకపోవడం, లేదా ఆధార్ అనుసంధానం కాకపోవడంతో పాప ఆధార్‌కు లింక్ అవ్వడంతో పట్టా నాగేశ్వరీదేవి పేరు మీద పట్టా వచ్చి ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు