పట్టుచీరల దొంగ.. ఉన్నతాధికారి భార్య?

1 Jul, 2014 09:01 IST|Sakshi
పట్టుచీరల దొంగ.. ఉన్నతాధికారి భార్య?

వస్త్రాల దుకాణంలో చోరీకి పాల్పడ్డ ఇద్దరు నిందితులను పంజగుట్ట పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే... పంజగుట్ట వెంకటరమణ కాలనీలో వసుధ శారీస్‌ను వాణికుమారి నిర్వహిస్తోంది. ఈమె దుకాణంలోకి శనివారం రాత్రి ఇద్దరు మహిళలు వచ్చి చీరలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి ఒక్కో చీర రూ. 40 వేల విలువ చేసే మొత్తం ఆరు చీరలను దొంగలించారు.

 

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా దొంగతనం చేసింది ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి భార్య అని గుర్తించి... ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈమెతో పాటు ఆమెకు సహకరించిన మరో యువతిని కూడా అరెస్టు చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసులు తాము ఎవరిని అరెస్టు చేయలేదని చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు