పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి

6 Aug, 2015 12:52 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు జి.కిషన్ రెడ్డి సూచించారు. గురువారం హైదరాబాద్లో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై బీజేపీ నిర్వహించిన అవగాహన సదస్సులో కిషన్రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ... కృష్ణా, గోదావరిపై పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరవుపై ప్రకటన చేయకపోవడం దారుణమని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. త్వరలో పెండింగ్ ప్రాజెక్టులపై పోరాటం చేయనున్నట్లు కిషన్రెడ్డి వివరించారు.
 

>
మరిన్ని వార్తలు