శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ట్యాక్సీ డ్రైవర్ల అరెస్ట్

15 Jun, 2016 12:41 IST|Sakshi

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకి చొరబడి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నట్యాక్సీ డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టి, తర్వాత అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలసులకు సమాచారం అందింది. దీంతో ఐదుగురు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. ఈ సందర్భంగా వారి కార్లను సీజ్ చేయడంతో పాటు ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు