కల్తీ శెనగ పిండి మిల్లుపై పోలీసుల దాడి

16 Dec, 2015 15:33 IST|Sakshi

పహాడీ షరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధి శ్రీరామకాలనీ పారిశ్రామిక వాడలో కల్తీ శెనగ పిండి తయారు చేస్తున్న మిల్లుపై ఎస్‌వోటీ పోలీసులు బుధవారం ఉదయం దాడి చేశారు. ఈ దాడిలో సుమారు రూ.6 లక్షల విలువైన 110బస్తాల రాందేవ్ బ్రాండ్ శెనగపిండి, 276 బస్తాల శెనగపప్పు, 9వేల ఖాళీ కవర్లతోపాటు మిల్లును సీజ్ చేశారు. సూరజ్‌మల్, దుర్గయ్య, చౌహాన్ రాహుల్ అనే వారిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు.



 

మరిన్ని వార్తలు