ఉప్పల్‌లో పోలీసుల తనిఖీలు

14 Apr, 2016 08:50 IST|Sakshi

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్‌లో పేకాట స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. గురువారం తనిఖీలు చేపట్టిన పోలీసులు 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ. 80 వేల నగదు, 16 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసున్నారు. కేసు నమోదు చేసి నిందితులను ఉప్పల్‌ స్టేషన్‌కు తరలించారు.
 

మరిన్ని వార్తలు