సాక్షి, హైదరాబాద్ : పాత బస్తీలో ముస్లిం బాలికలకు కాంట్రాక్టు వివాహాలు జరుపుతున్నారన్న ఆరోపణలపై 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి వివాహాలు జరుగుతున్నాయని తమకందిన సమాచారం మేరకు డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలోని పోలీసుల బృందం తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా ముగ్గురు ఖాజీలు, 8 మంది అరబ్షేక్లు, ఐదుగురు మధ్యవర్తులు, నలుగురు హోటల్ యజమానులను అరెస్టు చేసినట్లు వీరందరిని విచారిస్తున్నట్లు చెప్పారు.