మైలార్దేవ్పల్లిలో పోలీసులు ముమ్మర తనిఖీలు

10 Aug, 2014 08:22 IST|Sakshi

హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని మైలార్దేవ్పల్లిలో రాజీవ్ గృహకల్ప, పహాడీ షరీఫ్ ప్రాంతాలలో పోలీసులు ఆదివారం తెల్లవారుజాము నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 సిలిండర్లు, 4 కార్లు, 3 ఆటోలు, 17 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారందరిని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ సోదాలలో దాదాపు 350 మంది పోలీసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు