కార్డన్ సెర్చ్‌: 50 ద్విచక్రవాహనాలు స్వాధీనం

27 Feb, 2017 09:31 IST|Sakshi

హైదరాబాద్: పాతబస్తీ, చంద్రాయణగుట్ట ప్రాంతంలో సోమవారం వేకువజామున పోలీసులు నిర్భంధ తనిఖీలు చేపట్టారు. దక్షిణ మండల డీసీపీ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు తనిఖీలు నిర‍్వహించారు.

ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో 90 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. పోలీసులు 11 మంది రౌడీషీటర్లు, 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు