నేదురుమల్లికి ప్రముఖులు నివాళులు

9 May, 2014 09:18 IST|Sakshi

హైదరాబాద్  : అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ....నేదురుమల్లి భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం నేదురుమల్లి జనార్దనరెడ్డి భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామం వాకాడు తీసుకు వెళతారు. కుటుంబ సభ్యులు రేపు సాయంత్రం నేదురుమల్లి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 

మరిన్ని వార్తలు