హైదరాబాద్: కూకట్పల్లి ఓమ్ని ఆసుపత్రిలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఇంజక్షన్ వికటించి స్రవంతి(25) అనే గర్భిణీ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యమే స్రవంతి మృతికి కారణమని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.
ఊపిరితిత్తుల సమస్యకు చికిత్స తీసుకున్న అనంతరం డిశ్చార్జ్ చేసే సమయంలో ఇంజక్షన్ ఇవ్వడంతో స్రవంతి కోమాలోకి వెళ్లి మృతి చెందినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. తమ కుమార్తె మృతికి కారణమైన డాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని తండ్రి వీరేశం, అమ్మ సుజాతలు డిమాండ్ చేశారు.