రెండు వారాల పాటు నగరంలో రాష్ట్రపతి

16 Dec, 2015 09:36 IST|Sakshi
రెండు వారాల పాటు నగరంలో రాష్ట్రపతి

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కోసం ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నారు. రెండు వారాల పాటు (ఈ నెల 31 వరకు) బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన విడిది చేస్తారు.


రాష్ట్రపతి శీతాకాల విడిది షెడ్యూల్:
ఈ నెల18న హకీంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా రాష్ట్రపతి నిలయానికి ప్రణబ్ ముఖర్జీ చేరుకుంటారు. 19న తిరుమలగిరిలోని మిలిటరీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ స్నాతకోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ప్రణబ్ పాల్గొననున్నట్లు సమాచారం. ఈ 22న కర్ణాటకలోని బీదర్కు ప్రణబ్ వెళ్లనున్నారు. ఈ 27న ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో జరిగే ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక కాంగ్రెస్ సదస్సులో రాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం ఎర్రవల్లికి చేరుకుంటారు.

ఎర్రవెల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించే అయుత చండీయాగంలో పాల్గొంటారు. ఈ 30న సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే విందు కార్యక్రమానికి హాజరవుతారు. ఈ 31న ఉదయం హకీంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. షెడ్యూల్ ప్రకటించని మిగతా రోజుల్లో రాష్ట్రపతి నిలయంలోనే ప్రణబ్ ముఖర్జీ గడపుతారని సమాచారం.

మరిన్ని వార్తలు