చర్లపల్లి జైల్లో సెల్‌ ఫోన్‌ కలకలం

23 Jan, 2017 16:16 IST|Sakshi

హైదరాబాద్‌: చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీ వద్ద సెల్‌ఫోన్‌ లభ్యం అయిన ఘటన కలకలం రేపింది. మానస బ్లాక్‌లో రెండు నెలలుగా రిమాండ్‌ ఖైదీగా ఉంటున్న విదేశీయుడి వద్ద సోమవారం అధికారులు తనిఖీ చేసి సెల్‌ఫోన్‌ ఉన్నట్లు తేల్చారు.

దీని వెనుక జైలు సిబ్బంది హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ను స్వాధీనం చేసుకుని, ఖైదీని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు