ఆర్టీఏ కొరడా.. బస్సులు సీజ్

3 Jan, 2017 10:54 IST|Sakshi

హైదరాబాద్: నగరంలో ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. పలు ఏరియాలలో ఆర్టీఏ విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎల్బీనగర్ లో తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నాలుగు ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. మరో 10 ప్రైవేట్ బస్సుల యజమానులపై కేసులు నమోదుచేశారు. వారి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేవని అందుకే చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు