హైదరాబాద్ : గచ్చిబౌలి ఖాజా గుడా జైన్ కన్స్ట్రక్షన్ వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. డబ్బులు కట్టించుకుని రెండేళ్లు దాటినా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించక పోవడంతో ఆగ్రహించిన 200 మంది బాధితులు జైన్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయం ముందు శనివారం ధర్నా చేశారు. స్వంత ఇంటికల సాకారం చేసుకునేందుకు తాము రెండేళ్ల క్రితం డబ్బు కడితే జైన్ కన్స్ట్రక్షన్స్ యజమాని సందీప్ మెహతా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు. తక్షణమే ప్లాట్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండే చేశారు.