మెరుగైన సేవలందించండి

18 Aug, 2017 03:14 IST|Sakshi
మెరుగైన సేవలందించండి
  • రైల్వే సహాయ మంత్రి గొహెయిన్‌
  • సాక్షి, హైదరాబాద్‌: రైల్వే ప్రయాణికులకు మెరుగైన వసతులు అందించాలని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్‌ గొహెయిన్‌ పేర్కొన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. గురువారం ఆయన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు.

    అనంతరం దక్షిణ మధ్య రైల్వే ద్వారా ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు జనరల్‌ మేనేజర్‌ జాన్‌ థామస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు