కోఠిలో సైకో వీరంగం

20 Aug, 2015 10:03 IST|Sakshi

కోఠి: హైదరాబాద్ నగరం కోఠి ప్రాంతంలో గురువారం ఉదయం ఓ సైకో వీరంగం సృష్టించాడు. అటుగా వెళ్తున్న పాదచారులపై ఐరన్ రాడ్తో దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుణ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 'సాక్షి' సమాచారంతో పోలీసులు ఆ సైకోను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు