హైదరాబాద్: యాదాద్రి జిల్లాలో బునాదిగానికాలువ, పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువను ఆధునీకరిస్తున్నామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడారు. కాలువల అభివృద్ధికి రూ. 284 కోట్లు కేటాయించామని, కాలువలను తొందరగా పూర్తి చేసేందుకు ఇంజనీర్లు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. భూసేకరణ విషయంలో రైతులను ఒప్పిస్తూ పనులను ముందుకు తీసుకెళ్తున్నారని, కాలువల కోసం అవసరమైన భూసేకరణకు నిధులు కేటాయించామని మంత్రి వివరించారు. చివరి పంటపోలాల దాకా నీరు అందిస్తామని చెప్పారు.