27న ఓయూకు రాహుల్ గాంధీ

7 Aug, 2015 18:54 IST|Sakshi

హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 27న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రానున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన రాహుల్ గాంధీని కోరినట్టు సమాచారం. అదే విధంగా ఈనెల 28న వరంగల్ లో రాహుల్ సభ ఉంటుందన్నారు. దాంతో పాటు అదే జిల్లాలోని భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో ముఖాముఖి ఉంటుందని ఉత్తమ్ తెలిపారు. రాహుల్ గాంధీ ఓయూకు రావాలిన కోరిన వారిలో వర్సిటీ జేఏసీ నేతలు కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు