హైదరాబాద్: పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో అల్పపీడనం వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరాలను ఆనుకొని సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఆవర్తనం మరింత బలపడి మరో 24 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడవచ్చునని తెలిపింది.