రకుల్ ప్రీత్ సింగ్ కొత్త బిజినెస్

21 Feb, 2016 02:37 IST|Sakshi
రకుల్ ప్రీత్ సింగ్ కొత్త బిజినెస్

ఫిట్‌నెస్ రంగంలోకి నటి రకుల్‌ప్రీత్
గచ్చిబౌలిలో ప్రారంభమైన అత్యాధునిక జిమ్

 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ రంగంలోకి అడుగుపెట్టారు. గచ్చిబౌలిలో ‘ఎఫ్ 45’ పేరుతో అత్యాధునిక జిమ్‌ను ఆమె నెలకొల్పారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఫిట్‌నెస్ స్టూడియో ప్రారంభోత్సవానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రకుల్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ వ్యాయామ ప్రియులకు అవసరమైన అన్నిరకాల అత్యాధునిక ఎక్విప్‌మెంట్ తమ ఫిట్‌నెస్ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సరైన విధానంలో రోజుకు 45 నిమిషాలు వ్యాయామం చేస్తే చక్కని శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చన్నారు రకుల్.      - సాక్షి, వీకెండ్ ప్రతినిధి

>
మరిన్ని వార్తలు