ఎయిర్పోర్ట్లో భారీగా ఎర్రచందనం పౌడర్ స్వాధీనం

30 May, 2014 08:33 IST|Sakshi

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అమీర్ అహ్మద్ అనే వ్యక్తి నుంచి కస్టమ్స్ అధికారులు శుక్రవారం 37 కేజీల ఎర్రచందనం పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. అమీర్ అహ్మద్ శుక్రవారం ఉదయం దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు. ఆ క్రమంలో అతడి లగేజీలో అక్రమంగా ఉంచి 37 కేజీల ఎర్రచందనం పౌడర్ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అనంతరం ఆ ఫౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు అహ్మద్పై కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు