అసెంబ్లీలో గణతంత్ర వేడుకలు

27 Jan, 2018 04:51 IST|Sakshi
అసెంబ్లీలో జెండా ఆవిష్కరిస్తున్న స్పీకర్‌ మధుసూదనాచారి, చిత్రంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ, మండలిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభలో స్పీకర్‌ మధుసూదనాచారి, మండలిలో చైర్మన్‌ స్వామిగౌడ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాసనసభా కార్యదర్శి నరసింహాచార్యులు, శాసనసభ సచివాలయ ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయం తెలంగాణ భవన్‌లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జాతీయ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర వేడుకలు జరిపారు. 

మరిన్ని వార్తలు