చిల్లర ఇవ్వనందుకు క్యాషియర్‌పై దాడి

2 Dec, 2016 00:47 IST|Sakshi
చిల్లర ఇవ్వనందుకు క్యాషియర్‌పై దాడి

ఇద్దరు వ్యక్తుల రిమాండ్

నాగోలు: పెట్రోల్ బంకులో చిల్లర ఇవ్వనందుకు క్యాషియర్‌పై దాడి చేసిన ఇద్దరిని ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. . శాతవాహననగర్‌కు చెందిన నవీన్ సాగర్‌రింగ్‌రోడ్డులోని భారత్ పెట్రోల్ పంపులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు.

బుధవారం రాత్రి మైత్రినగర్‌కు చెందిన రాజేందర్‌రెడ్డి, వెంకటేష్ పెట్రోల్ పోరుుంచుకునేందుకు అక్కడికి వచ్చిరు. రూ500 నోటు ఇచ్చి పెట్రోల్ పోయమని కోరగా, క్యాషియర్ చిల్లర లేదని చెప్పడంతో అతనిపై దాడి చేసి గాయపర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు