పాతబస్తీలో రిటైర్డ్‌ జవాన్‌ ఆత్మహత్య

25 Jan, 2018 12:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో ఓ రిటైర్డ్ జవాన్ గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకొని రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ వేణుగోపాల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు గుర్తించారు. ' నా చావుకు ఎవరూ కారణం కాదు' అని నోట్‌లో వేణుగోపాల్‌ పేర్కొన్నాడు. కుటుంబ సభ్యుల ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు