అన్ని పక్షాలతో కలసి సమరం: రేవంత్‌

13 Dec, 2016 02:28 IST|Sakshi
అన్ని పక్షాలతో కలసి సమరం: రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా సమస్యల పరిష్కారంలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై అన్ని పార్టీలతో కలసి శాసనసభలో పోరాడతామని టీడీఎల్పీ నేత, టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన టీడీఎల్పీ, టీటీడీపీ ముఖ్యనేతల సమావేశం అసెంబ్లీలోని కార్యాలయంలో సోమవారం జరిగింది. అనంతరం ఎమ్మెల్యేలు ఆర్‌.కృష్ణయ్య, సండ్ర వెంకట వీరయ్య, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డితో కలసి రేవంత్‌ విలేకరులతో మాట్లాడారు.

కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడానికి కేంద్రం ఇచ్చిన రూ.790 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించిందని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. వివిధ సమస్యల పరిష్కారానికి ఈ నెల 14, 15వ తేదీల్లో ఢిల్లీలో కేంద్రమంత్రులను కలుస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు