2015 రోడ్డు ప్రమాదాల గణాంకాలు విడుదల

9 Jun, 2016 16:09 IST|Sakshi
హైదరాబాద్‌: 2015కు సంబంధించి రోడ్డు ప్రమాదాల గణాంకాలను గురువారం నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసింది. 2014లో కంటే 2015 సంవత్సరంలో 2.5 శాతం ప్రమాదాలు పెరగగా, 4.6 శాతం మరణాలు సంభవించినట్టు వెల్లడించింది. రోజుకు సగటున 1,374 రోడ్డుప్రమాదాలు జరుగుతుండగా, 400 మరణాలు సంభవిస్తున్నట్టు పేర్కొంది.

అయితే రోడ్డుప్రమాదాల మృతుల్లో 54.1 శాతం మంది 15 నుంచి 34 ఏళ్ల లోపువారేనని తెలిపింది. ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాద మరణాల్లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం తొలిస్థానంలో ఉంది. ఏడోస్థానంలో ఆంధ్రప్రదేశ్‌, తొమ్మిదో స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టు ఎన్‌సీఆర్‌బీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
మరిన్ని వార్తలు