షాపు షట్టర్ పగలగొట్టి... నగదు చోరీ

20 Jul, 2016 08:22 IST|Sakshi

హైదరాబాద్: తాళం వేసి ఉన్న షాపు షట్టర్ పగలగొట్టిన దొంగలు దుకాణంలోని నగదుతో ఉడాయించారు. ఈ సంఘటన నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ అనుపమ కళ్యాణమండపం సమీపంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. బుధవారం షట్టర్ లేపి ఉండటాన్ని గమనించిన గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. రూ. 50 వేల నగదుతో పాటు కొన్ని విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సమీపంలోని సీసీ టీవీ ఫూటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని వార్తలు