హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ వేముల రోహిత్ది బీసీనా, ఎస్సీనా అని ప్రభుత్వాధికారులు అనడం సిగ్గుచేటని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రోహిత్ సంస్మరణ సభ సోమవారం జరిగింది. ఈ సభకు జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్, గుండా మల్లేష్ పాటు పలువురు నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ వైస్ చాన్సలర్ అప్పారావుపై చర్యలు తీసుకుంటామన్న కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రోహిత్ మరణించి ఏడాది అయిన దీనిపై ప్రధాని మోదీ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని ఫాసిస్ట్ ధోరణితో వ్యవహరించారని ఆరోపించారు.
రోహిత్ది ఆత్మహత్య కాదు సంస్థాగత హత్యని కోదండరామ్ అన్నారు. రోహిత్ మరణానికి కులవివక్షే కారణమన్నారు. భవిష్యత్లో యూనివర్శిటీల్లో కులవివక్షతను నిర్మూలించాలంటే రోహిత్ చట్టాన్ని అమలు చేయాలని కోదండ రామ్ డిమాండ్ చేశారు.