బోరబండలో రెచ్చిపోయిన రౌడీలు

16 Feb, 2016 13:37 IST|Sakshi

హైదరాబాద్: బోరబండలో రౌడీలు రెచ్చిపోయారు. మద్యానికి డబ్బులివ్వలేదన్న కారణంతో ఓ యువకుడిని చిదకబాదారు. అవమానం తట్టుకోలేక బాధితుడు ఆత్మాయత్నం చేశాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. తీవ్రగాయాలపాలైన అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు వదిలాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. యువకుడి మరణానికి కారకులైన రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు