రూ. 40 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి

31 Mar, 2015 14:28 IST|Sakshi
రూ. 40 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి

హైదరాబాద్: నగరంలోని నాంపల్లి రైల్వే స్టేషన్లో పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఓ వ్యక్తి నుంచి ఆధారాలు లేకుండా తీసుకుపోతున్న రూ. 40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నగదుతోపాటు అతడిని పక్కనే ఉన్న రైల్వే పోలీసు స్టేషన్కు తరలించారు.

కూకట్పల్లి నుంచి శబరి ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు సదరు వ్యక్తి నాంపల్లి రైల్వే స్టేషన్కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం శబరి ఎక్స్ప్రెస్లో అక్రమంగా తరలిస్తున్న వెండిని పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లో తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు.
 

మరిన్ని వార్తలు