నారాయణగూడ వద్ద రూ. 60 లక్షలు స్వాధీనం

15 Apr, 2014 09:50 IST|Sakshi
నారాయణగూడ వద్ద రూ. 60 లక్షలు స్వాధీనం

ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అందులోభాగంగా మంగళవారం నారాయణగూడ వద్ద తనిఖీలలో భాగంగా ఓ కారు నుంచి  రూ.60 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

 

తమ స్వస్థలం ముంబై అని, వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చామని సదరు వ్యక్తులు పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే నగదుకు సంబంధించి సరైన పత్రాలు వెల్లడించకపోవడంతో పోలీసులు ఆ ముగ్గురుని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అలాగే నగదు, కారును కూడా స్టేషన్కు తరలించి సీజ్ చేశారు.

మరిన్ని వార్తలు